Metpally: మెట్ పల్లి/మల్లాపూర్, జూన్ 05 (ప్రజా శంఖారావం):ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి యువరైతు మృతి చెందిన ఘటన మల్లాపూర్ మండలం రాఘవపేట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చెదలు ప్రవీణ్ (30) తన కొడుకుతో కలిసి వ్యవసాయ పొలంలో పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మూల మలుపు వద్ద అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడడంతో యువ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కొడుకు శ్రీ హాన్ (10) పక్కన ఉన్న పొలంలో పడటంతో కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now