Metpally: ఇసుక ట్రాక్టర్ డీ కొని యువకుడి మృతి

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి,జూన్5(ప్రజా శంఖారావం): మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో ఇసుక ట్రాక్టర్ డీ కొని బండలింగాపూర్ గ్రామానికి చెందిన గున్నాల రవి(18) అనే యువకుడు మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టణ శివారులోని వెల్లుల్ల బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ని డీ కొట్టడంతో బైక్ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పంచనామా నిమ్మితం మెట్ పల్లి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.మృతుడు రహదారి ప్రమాదంలో చిన్న వయసులో మృతి చెందటంతో ఆసుపత్రి ప్రాంగణంలో బంధువుల రోదనలు మిన్నంటాయి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now