Scheme for Farmers: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం ఇప్పటివరకు చాలా చేసింది. రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రుణమాఫీ ఇచ్చింది. అలాగే రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేసింది. క్వింటాలుకు 500 రూపాయల చొప్పున సన్నబియానికి బోనస్ కూడా ఇస్తుంది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ప్రయోజనాలు చేకూరుస్తున్న కూడా ఎందుకు రైతుల ధర్నాలు, ఉద్యమాలు జరుగుతున్నాయా ఎవరికి తెలియడం లేదు. ఈ పథకాలలో ప్రయోజనాలు రైతులకు సక్రమంగా అందడం లేదని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరిని ఆకర్షించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని రైతుల కోసం తీసుకొని వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రైతు కుటుంబాలను ఆకట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం పాడి గేదెల పంపిణీ పథకాన్ని తీసుకొని వస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మార్కెట్లో ఒక గేద విలువ ఒక్క లక్ష రూపాయలు ఉంటుంది. గేదెలకు వ్యాక్సిన్లకు కూడా వేలకు వేలు ఖర్చు అవుతుంది. అటువంటి గేదెలను తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇవ్వడానికి రెడీ అవుతుంది.
దీంతో ప్రభుత్వం పై పెద్ద భారమే పడుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో నిండా అప్పులు ఉన్న సమయంలో ప్రభుత్వం ఇటువంటి పథకాన్ని అమలు చేయడం అంటే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. దసలవారీగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసి రైతులకు దగ్గరయ్యే ఆలోచనలో ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వం పాడి గేదెలను ఉచితంగా ఇవ్వాలని ఆలోచిస్తుంది. దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను గ్రామాలలో ప్రకటించి ప్రతి కుటుంబానికి కూడా రెండు పాడి గేదెలను ఉచితంగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.