Gold Loans: RBI కొత్త నియమాలు.. ఇకపై బంగారాన్ని ఈ విధంగా తాకట్టు పెడితే లోన్ రాదు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారంపై లోన్ తీసుకునే వారి కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఇకపై బంగారంపై ఈటీఎఫ్లు మరియు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆధారంగా లోన్స్ ఇవ్వరు. ముందుగా లోన్ టు వాల్యూ రేషియోను పరిగణించి దాన్నిబట్టి 85% లేదా 80% లేదా 75% గా లోన్ నిర్ణయిస్తారు. అలాగే బంగారం తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నప్పుడు పరిమితులు అలాగే రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత ఏడు పని దినాలలోగా బంగారాన్ని సదరు వ్యక్తికి తిరిగి ఇవ్వాలని నిబంధనలు కూడా ఉన్నాయి. తాజాగా బంగారం పై లోను తీసుకుంటున్నా వారి కోసం ఆర్బిఐ సరికొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.
ఆర్బిఐ ప్రకటించిన ఈ కథ నియమాల ప్రకారం బంగారంపై లోన్స్ తీసుకోవడానికి అలాగే తిరిగి చెల్లించడానికి కూడా అవి మరింత పారదర్శకతను మరియు భద్రతను అందించనున్నాయి. ఆర్బిఐ ప్రవేశపెట్టిన ఈ కొత్త నియమాలు ముఖ్యంగా మోసాలను అరికట్టడంలో అలాగే రుణదాతలకు మరియు రుణ గ్రహీతలకు స్పష్టమైన నియమాలను రూపొందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన దాని ప్రకారం ఆర్.బి.ఐ ప్రవేశపెట్టిన ఈ నియమాలు అన్ని బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా ఒకే విధంగా ఉంటాయని తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన కొత్త నియమాల ప్రకారం ఇకపై రుణాన్ని అందించే సంస్థలు ఎక్స్చేంజ్ ఫండ్స్ లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఆధారంగా లోన్స్ ఇవ్వకూడదు. డిజిటల్ రూపంలో ఉన్న బంగారాన్ని సంస్థలలో తాకట్టు పెట్టి రుణం పొందలేరు. భౌతికంగా ఉన్న బంగారం ఆధారంగానే రుణాలు మంజూరు చేయాలి. బంగారంపై రుణం తీసుకుంటున్న సమయంలో రుణ దాతలు ఆ బంగారం నాణ్యతతో పాటు తాకట్టు పెడుతున్న తేదీకి తొలి 30 రోజుల్లో బంగారం మార్కెట్లో సగటు ముగింపు ధరను పరిగణలోకి తీసుకొని రుణాన్ని మంజూరు చేయాలి.