News Rules: తాజాగా చెక్ బౌన్స్ పై కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులను త్వరగా పరిష్కరించడానికి అలాగే ఇబ్బందులను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్న కూడా చెక్కులకు ఉన్న ప్రాముఖ్యత మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు అని చెప్పవచ్చు. చాలామంది వ్యక్తిగత అవసరాల కోసం లేదా వ్యాపారం కోసం చెక్కులను ఉపయోగిస్తున్నారు. కొంచెం ఎక్కువ అమౌంట్ ఎవరికైనా ఇవ్వాలి అన్నా లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అన్నా కూడా చెక్కులు అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చాలామంది భావిస్తున్నారు.
చెక్కులలో మనకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య చెక్కు బౌన్స్ అవడం. దీని గురించి ప్రభుత్వం కొత్త నియమాలను జారీ చేసింది. తాజాగా అమలులోకి వచ్చిన ఈ నియమాలు కొంచెం కఠినంగా ఉంటాయి అని తెలుస్తుంది. మీరు వేరొకరికి చెక్కు ఇచ్చినా తర్వాత వాళ్లు దానిని బ్యాంకులో జమ చేసినప్పుడు మీ అకౌంటులో తగినంత బ్యాలెన్స్ లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. ఒకవేళ సంతకం సరిపోలేకపోయినా కూడా చెక్కు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కు బౌన్స్ కేసులను త్వరగా పరిష్కరించడానికి అలాగే వాటికి సంబంధించిన ఇబ్బందులను తగ్గించడానికి తాజాగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం చెక్ బౌన్స్ జరిగినట్లయితే ఆ కేసులను ఆరు నెలల లోపు పరిష్కరించాలి. పిటిషనర్ కు చెక్ బౌన్స్ కేసు పరిష్కారం అయ్యేవరకు మధ్యంతర పరిహారం చెల్లించాలి. చెక్కు మొత్తంలో 20% పరిహారాన్ని కేసు ప్రారంభంలోనే చెల్లించాలి అని స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా ఇచ్చిన చెక్కు పదేపదే బౌన్స్ అయితే ఆ సదరు బ్యాంకు వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది.