Kamareddy: కసాయి తండ్రి చేతిలో కన్న కొడుకు

Kamareddy
Kamareddy
Kamareddy: ఎల్లారెడ్డి/నాగిరెడ్డిపేట్, జూన్ 13 (ప్రజా శంఖారావం): కసాయి తండ్రి చేతిలో కన్న కొడుకు కడతేరిన విషాద ఘటన జిల్లాలో కలకలం రేపింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడిని కన్న తండ్రి కడ తేర్చిన అమాననీయ ఘటన శుక్రవారం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో కన్న తండ్రే చిన్నారుడి నోరు మూసి హత్య చేసిన ఘటన స్ధానికంగా కలకలం రేపింది. సీఐ సీఐ రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన అక్షితకు పోల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్ తో 5 సంవత్సరాల కిందట వివాహం జరిగింది.

వీరికి నాలుగేళ్ల కుమారుడు శశాంక్, ఏడు నెలల కుమార్తె ఉన్నారు. మెదక్ జిల్లా శాలిపేట గ్రామంలో బోనాల పండుగ నిమిత్తం బంధువుల వద్దకు అనిల్ కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడికి అతడి చెల్లెలి కుటుంబం కూడా వచ్చింది. పిల్లలు ఆడుకుంటూ చెల్లెలు కుమార్తెను అనిల్ కుమారుడు మెట్లపై నుంచి నెట్టివేశాడు. దీంతో గొడవ జరిగింది.పోల్కంపేటకు వెళ్లాక అనిల్ తన భార్యతో గొడవపడి కొట్టాడు. గాయపడిన ఆమెను పోచారం తీసుకొచ్చి వైద్యం చేయించాడు.

కుమారుడిని బయటకు తీసుకెళ్తానని చెప్పిన అనిల్ తన ద్విచక్ర వాహనంపై పోచారం గ్రామ శివారులోకి తీసుకువెళ్లాడు. భార్యపై కోపంతో కుమారుడి ముక్కు, నోరు మూసి స్పృహ కోల్పోయేలా చేసి అత్తారింటికి తీసుకొచ్చాడు. బాబు స్పృహ కోల్పోవడం గమనించిన తల్లి వైద్యం నిమిత్తం మండల కేంద్రంలోని ఆసుపత్రికి ఆటోలో తరలించగా వైద్యుడు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. అనిల్ ను భార్య గట్టిగా నిలదీయడంతో విషయం బయటకొచ్చింది. తానే హత్య చేసినట్లు చెప్పి అక్కడ నుంచి పరారయ్యాడు. తల్లి అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ నాయక్ తెలిపారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now