AirIndia Crash: నేను బతికే ఉన్నానా అనుకున్న.. అహ్మదాబాద్ క్షగాత్రుణ్ణికి..ప్రధాని పరామర్శ..

PM MODI
PM MODI

AirIndia Crash: నేను బతికే ఉన్నానా అనుకున్న.. అహ్మదాబాద్ క్షగాత్రుణ్ణికి.. ప్రధాని పరామర్శ..

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కరు ప్రాణాలతో బతికారు. అతడే విశ్వాస్ కుమార్ రమేష్. విమానం ప్రమాదం జరిగిన తీరు గమనిస్తే, చూసేవారికి కుమార్ రమేష్ నిజంగా అదృష్ట వంతుడు. నిండు నూరేళ్లు జీవిస్తాడు అంటున్నారు కుమార్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది. అతన్ని చూడటానికి వచ్చిన జనం కూడా ఔరా నిజమేనా ఇతను బతికింది అని ముక్కున వేలేసుకుంటున్నారు.

అతను ప్రాణాలతో బతికి బయట పడిన తీరును ఒక్కొక్కరు, ఒక్కొక్క విదంగా కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రత్యక్షంగా చూడక పోయినప్పటికీ ఎక్కడ విన్నా దేశవ్యాప్తంగా విశ్వాస్ కుమార్ రమేష్ చర్చనే జరుగుతోంది. అతన్ని స్వయంగా దేశ ప్రధాని కూడా పరామర్శించారు. ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యపోయారు. ఆ దశలో అతని డైర్యాన్నీ కూడా అభినందించాలి. ప్రమాదం జరిగిన తీరు, శబ్దాలు, మంటలు వీటన్నిటిని చూస్తేనే గుండె ఆగేంత దృశ్యాలు.

వీటన్నిటిని తట్టుకొని కుమార్ రమేష్ తట్టుకున్న గుండె గట్టిదంటున్నారు అహ్మదాబాద్ ప్రజలు. ప్రమాదం జరిగిన తీరు ఆసుపత్రిలో కుమార్ రమేష్ పరామర్శకులకు వివరిస్తుంటేనే ఒళ్ళు చెమటలతో నిండిపోతోంది. ఏది ఏమైనప్పటికి అయన జాతకం ప్రకారం అదృష్ట సంఖ్య బహుశ 11 కావచ్చు. అందుకనే పదకొండో నెంబర్ సీట్ ఆయన ప్రాణాలు కాపాడిందంటున్నారు అహ్మదాబాద్ ప్రజలు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now