Rakhi Festival: ఈ ఏడాది రాఖీ పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా.. అలాంటి ముహుర్తం చాలా అరుదు.. మరి శుభ ముహూర్తం ఎప్పుడు ?
హిందూ కుటుంబాలు జరుపుకునే పండుగలల్లో రాఖీ పండుగ ఒకటి. ఈ పండుగకు ఒక ప్రత్యేకత కూడా ఉంది. అన్ని పండుగల ప్రత్యేకత వేరు. ఈ పండుగ ప్రత్యేకత వేరు. అన్నా, చెల్లెలు, అక్కా తమ్ముళ్లు జరుపుకునే పండుగ ఏదంటే రాఖీ పండుగ ఒకే ఒక్కటి. ఎక్కడ ఉన్నా సోదరుని ఇంటికి సోదరి వస్తుంది. ఒకవేళ వీలుకాని పరిస్థితుల్లో సోదరుడే సోదరి ఇంటికి వెళుతారు. ఇలా ఏడాదికి ఒక్కసారి జరుపుకునే పండుగ ప్రత్యేకత ఇలా ఉంటుంది.
రవాణా మార్గం సరిగా లేని వారు, దూర ప్రాంతాల్లో ఉండేవారు, ఇతర దేశాల్లో ఉండేవారు కొరియర్ ద్వారా రాఖీ సోదరునికి పంపి పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పండుగకు ముందస్తుగానే రాఖీ పంపి ఆనందాన్ని పంచుకుంటున్నారు సోదర, సోదరీమణులు. అయితే ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడు వస్తుంది. ఆరోజు శుభ ముహూర్తం ఏమిటనేది వేదపండితులు ఈ విదంగా చెబుతున్నారు.
2025 ఆగష్టు 9 న రాఖీ పండుగ జరుపుకోవచ్చని వేద పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం, పౌర్ణమి తిథి మధ్యాహ్నం 2:12 గంటలకు ముహూర్తం మొదలవుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ యేడాది వచ్చే రాఖీపూర్ణిమ చాలా ప్రత్యేకత ఉందని, ముహూర్తం మంచి గడియలలో వస్తున్నట్లు వేద పండితులు విశ్లేషిస్తున్నారు. ఆ శుభ సమయంలో రాఖీ కట్టుకోడానికి మంచి ముహూర్తమని వేదపండితులు చెబుతున్నారు.