Todays Gold Rate: బులియన్ మార్కెట్లో పసిడి బాద్ షా.. మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. తులం ఎంతో తెసుసా..!

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దాని ప్రభావం మాత్రం బంగారంపై ఏమాత్రం పడడం లేదు అని తెలుస్తుంది. బంగారం ధరలు గరిష్ట సాయికి చేరుకుంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం రానున్న మరో రెండు నెలల్లో వీటి ధరలలో 10% అలాగే వచ్చే ఏడాదిలో దాదాపు 30 శాతం వరకు మార్పును చూసేందుకు అవకాశం ఉంది. అంతర్జాతీయంగా జరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకు కొనుగోలు, డి డాలరైజేషన్ను ఫ్యాక్టరీ చేసి వచ్చే ఏడాదికి బంగారం ధరలను సిటీ బ్యాంక్ అంచనాలను తగ్గించింది.

దీని ప్రకారం చూసుకుంటే రానున్న మరో మూడు నెలలలో సిటీ బ్యాంక్ బంగారం రేటును 3500 ఔన్స్ నుంచి 3300 డాలర్లకు తగ్గించింది. అయితే ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మొదలైన సమయంలో తొలి రోజు బంగారం ధర భారీగా పెరిగింది. కానీ ఆ తర్వాత పెరిగిన ఉద్రిక్తతలు ఈ ధరలపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇక ప్రస్తుతం బంగారం రేట్లు చూసుకుంటే ఈ రెండు రోజులలో తులం బంగారంపై 700 రూపాయలు పెరిగింది. వరుసగా రెండో రోజు కూడా మన దేశం మార్కెట్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.

స్వచ్ఛమైన తులం బంగారం ధర ఈరోజు రూ.1,01,080, 22 క్యారెట్ల ఆర్నమెంట్ తులం ధర రూ.92,650 గా ఉంది. ఇక వెండి రేట్లు కూడా మన దేశం మార్కెట్లో భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు ఒక్కరోజు కిలో వెండి ధరపై వేయి రూపాయలు పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,22,000 గా ఉంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now