Viral Video: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యువత ఇంస్టాగ్రామ్ రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్నారు. చాలామంది రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలని వెర్రి చేష్టలతో రీల్స్ చేసే ఫాలోవర్లను సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఫేమస్ అవ్వడానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టి లేదా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టి కొంతమంది చేస్తున్నారు. ఇప్పటికే స్టంట్ రీల్స్ చేసి కొంతమంది యువత గతంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల రైల్వే ట్రాక్ పై ఒక యువకుడు ప్రమాదక స్టంట్ కు సామాజిక మాధ్యమాలలో నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు.
ఆదివారం రోజు ఎక్స్ వేదికగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రైలు వెళుతుండగా ఒక యువకుడు ట్రాక్ మధ్యలో నిలువుగా పడుకున్నాడు. ఆ ట్రైన్ యువకుడి పైనుంచి వెళ్లిపోయిన తర్వాత అతను లేచి నిలబడి తాను ఏదో సాధించినట్లుగా అక్కడ ఉన్నవారికి విజయ సంకేతం ఇచ్చాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ విసి సజ్జనార్ ఫేమస్ అవడం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం చాలా పిచ్చితనం, సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందడం కోసం విలువైన ప్రాణాలను ఇలాగా పణంగా పెట్టాలా, ఏదో ఘనకార్యం చేసినట్టు పట్టరాణి సంతోషం ఎందుకు ఇలాంటివి మీకు చాలా సరదాగా అనిపించవచ్చు.
కానీ ఒకవేళ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం చాలామంది ఇచ్చి పరాకాష్టకు చేరిందని ఇటువంటివారిని రైల్వే శాఖ, ఆర్పిఎఫ్ సిబ్బంది అరెస్టు చేయాలని చాలామంది ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు. ఇలాంటి వాళ్లను అరెస్టు చేయాలని లేకపోతే వీడిని చూసి ఇంకా కొంతమంది ఇలాగే చేస్తారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.