Gold: బంగారంపై లోన్ తీసుకునే వారికి.. ఆర్బిఐ కొత్త రూల్స్.. ఏంటో తెలుసా..!

Gold
Gold

Gold: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో బంగారంపై లోన్ తీసుకోవాలి అని భావిస్తున్న వారికి ఒక మంచి శుభవార్త చెప్పబోతుంది. తాజాగా ఆర్బిఐ బంగారంపై బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో అందించే రుణాలకు సంబంధించి నిబంధనలను ప్రమాణీకరించడానికి ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. బంగారం రుణవిధానంలో ఈ ప్రతిపాదనలు ఏకరూపతను తీసుకురావడం మాత్రమే కాకుండా రుణగ్రహితలకు పారదర్శకతను కూడా పెంచుతాయి.

నిపుణులు చెప్తున్న దాని ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బంగారు ఆభరణాలు తాకట్టుగా పెట్టుకుని ఇచ్చే లోన్ కోసం కొత్త ప్రమాణిక నిబంధనలను ఏర్పాటు చేసే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. రుణ గ్రహీతలకు రుణ పరిస్థితులపై ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం స్పష్టతను అందించడంతోపాటు వారికి ప్రయోజనం కూడా చేకూరుస్తాయని తెలుస్తుంది. ముసాయిదా మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బంగారు లోన్లపై ఎల్టివి నిష్పత్తిని 75 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నాయి. ఉదాహరణకు మీ బంగారం విలువ వంద అయినట్లయితే బ్యాంకు లేదా ఫైనాన్షియల్ కంపెనీలు మీకు గరిష్టంగా రూ.75 రుణంగా ఇస్తాయి.

కోవిడ్ 19 సమయంలో ఇది తాత్కాలికంగా 80 శాతానికి ఉండేది. బంగారంపై లోన్ తీసుకుంటున్న వారు బంగారం యాజమాన్య రుజువును తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర కొనుగోలు చేసిన రసీదులు లేకపోతే ఒక డిక్లరేషన్ అయిన తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తాకట్టు పెట్టిన బంగారం యాజమాన్యంపై రుణం ఇచ్చే వారికి సందేహం ఉన్నట్లయితే రుణ దాతలు రుణం ఇవ్వకూడదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముసాయిదా పేర్కొంది. రుణం ఇచ్చేవారు ఆ బంగారం స్వచ్ఛత తో పాటు బరువు, మినహాయింపులు అలాగే చిత్రం విలువను వివరిస్తూ ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. రుణ గ్రహీతలకు ఈ ధ్రువీకరణ పత్రాన్ని రుణ దాతలు అందించాలి.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now