LRS Scheme: ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం గుడ్ న్యూస్..
ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎల్ఆర్ఎస్ (LRS) పై మరో నెల గడువును పొడిగిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రేవంత్ సర్కార్ అధికారిక ప్రకటన చేయనుంది. మార్చి 31 తో వన్ టైం సెటిల్మెంట్ కింద ఎల్ఆర్ఎస్ ఫీజును చెల్లించాల్సిన వారికి మార్చి నెల చివరిలో ఉగాది, రంజాన్ పండుగలతో వరుస సెలవులు రావడంతో సమయానికి కొంతమంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించలేకపోయారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరో నెల గడువును పొడిగించి LRS రూపంలో ఖజానాకు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో మరో నెల రోజుల పాటు గడువును పొడిగించడానికి ప్రభుత్వం సుముకత చూపించింది. గత ప్రభుత్వం LRS పేరుతో అనాధికార లేవట్లను క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను ఈ ప్రభుత్వం కూడా 25 శాతం రాయితీతో మార్చి నెల 31 వరకు ఈ పథకాన్ని కంటిన్యూ చేసింది. రాష్ట్ర ఖజానాకు ఎల్ఆర్ఎస్ కింద ఫీజులు చెల్లించి లేవుట్ల క్రమబద్దీకరణతో ₹ 1200 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినట్లయింది.
ఈ పథకం ద్వారా మరో నెల గడువును పెంచితే ఇంకాస్త ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చి చేరుతుందనే ఆలోచన రాష్ట్ర సర్కార్ కు ఉన్నట్లుగా కనబడుతుంది. అయితే మార్చి నెల 31 వరకు ఇచ్చిన నిర్ణీత గడువులో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రజలు వినియోగించుకోలేకపోయారు. గత నెల 31 వరకు చెల్లించాల్సిన ఎల్ఆర్ఎస్ ఫీజులో ప్రభుత్వం 25% రాయితీని కల్పించింది.
రాయితీ తగ్గింపు
కానీ మరో నెల రోజుల గడువు పొడిగించడంతో ఈ రాయితీని 15 శాతానికి తగ్గించవచ్చని తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఖజానాకు కూడా కొంత లాభం చేకూరుతుందని, అటు గడువు లోపల ఫీజులు చెల్లించుకోలేని వారు కూడా తిరిగి LRS One time settlements చెల్లించుకునే అవకాశం కూడా కల్పించినట్లుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు LRS పేరుతో వన్ టైం సెటిల్మెంట్ కు మరో నెల గడువు పొడిగింపు పై ప్రభుత్వం ఈరోజు అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం.