Metpally Police:పోలీసుల విచారణలో కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్

Metpally Police
Metpally Police

Metpally Police: మెట్ పల్లి, ఆగస్టు16 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో రెండేళ్ల బలున్ని కిడ్నాప్ చేసిన నిందితుని పట్టుకోవడంతో పోలీసులు కిడ్నాప్ కేసు కథ సుఖంతమైంది అనుకున్నారు. కానీ కిడ్నాప్ చేసిన నిందితున్ని పోలీసులు విచారిస్తున్న సమయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇస్లావత్ నగేశ్, అతని భార్య లావణ్య మూడు నెలల్లో ముగ్గురు పిల్లలను కిడ్నాప్ చేసి ఇద్దరిని ఈ ఏడాది జూన్ లో అమ్మినట్లు విచారణలో తేలింది. ఈనెల13న రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ 1.50 లక్షలకు అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకొని దొరికిపోయిన విషయం తెలిసిందే.

కాగా జూన్ నెలలో ఆరేళ్ల అమ్మాయిని మేడిపల్లి మండలం పొరుమల్ల గ్రామానికి చెందిన ఓవ్యక్తికి రూ.2 లక్షలు, మూడేళ్ల అమ్మాయిని మెట్ పల్లి పట్టణం హనుమాన్ నగర్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.1.50 లక్షలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now