Kamareddy: మోడల్ ఎంసెట్,నీట్ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ

Kamareddy
Kamareddy

Kamareddy: కామారెడ్డి, మార్చి 22 (ప్రజా శంఖారావం): తెలుగు నాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్ష నమూనా పత్రాలను శనివారం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్ లు ఆవిష్కరించారు. ఈనెల 23న ఆదివారం ఉదయం 10 గంటల నుండి ఒకటి గంటల వరకు వి.ఆర్.కె అకాడమీలో విద్యార్థులకు పరీక్ష నీర్వహించడం జరుగుతుందనీ వారు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహనను, భయాన్ని తొలగించడం కోసం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం 100 మినిట్స్ 100 షార్ట్ కట్స్ అనే కార్యక్రమాన్ని గణిత అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షా విధానానికి, ఎంసెట్, నీట్ పోటీ పరీక్షల విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందని మంచి ర్యాంకు సాధిస్తేనే మంచి కళాశాలలో ఇంజనీరింగ్ మెడిసిన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందనీ చెప్పారు. ఈ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు ప్రశ్నాపత్రం పైన అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవళి, సంధ్య, ప్రసన్న, రజిని, వసంత, సంతోష, ప్రవళిక పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now