Ration Card: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తన దృష్టి మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుమానస్పద రేషన్ కార్డుల పై పెట్టింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలుగా బియ్యం తీసుకోకుండా ఉన్న 96 వేలరేషన్ కార్డులను అధికారులు గుర్తించారు. 6 వేలకు పైగా కార్డులు అనర్హమైనవిగా ఇటీవలే విచారణలో బయటపడ్డాయి. ఇప్పటికే దీనికి సంబంధించి సూర్యాపేట జిల్లాలో విచారణ పూర్తి అయింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 12 జిల్లాలలో విచారణ మొదలు కాలేదు. విచారణలో రేషన్ కార్డులు అనర్హమైనవిగా గుర్తిస్తే వాటిని రద్దు చేసే అవకాశం ఉంది. అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో భారీ స్థాయిలో రేషన్ కార్డులు అనర్హులు ఉన్నట్లు తేలింది.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. అధికారులు గత ఆరు నెలల నుంచి ఇప్పటివరకు బియ్యం తీసుకొని రేషన్ కార్డుదారుల వివరాలను సేకరించారు. వాటిలో ఏకంగా 96 వేల రేషన్ కార్డులు అనుమానస్పదంగా తేలినట్లు సమాచారం. మే 22 వరకు అధికారులు ఈ విచారణలో మొత్తం 6 వేలకు పైగా రేషన్ కార్డులను అర్హత లేనివిగా అధికారులు గుర్తించారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండడంతో రేషన్ కార్డుకు సంబంధించి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి.
కొంతమంది అర్హత లేని వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకొని అక్రమంగా రేషన్ కార్డులు పొందుతున్నారని విచారణలో తేలింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల మొదటి వారంలో 90.71 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2.93 కోట్ల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా వేశారు. వీళ్ళ కోసం 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ప్రతినెలా డీలర్లకు సరఫరా చేస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు వినియోగదారులకు సన్న బియ్యం పథకం అమలు చేస్తున్న క్రమంలో నిరుపేదలు ఈ బియ్యం పొందడానికి బారులు తీరుతున్న సమయంలో 1.6 లక్షల మంది రేషన్ కార్డు కలిగిన వారు మాత్రం పట్టా లేకుండా పోయారు. వాళ్లందరూ రేషన్ తీసుకున్నట్లు ఎక్కడ కూడా రికార్డులలో కూడా లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ విచారణలో అర్హత లేని రేషన్ కార్డులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది.