Indian Railways: కేవలం రూ.25 తో దేశం మొత్తం తిరిగి రావచ్చు.. ఈ రైలులో ప్రయాణించడానికి అర్హులు ఎవరంటే

Indian Railways
Indian Railways

Indian Railways: మన దేశం ప్రకృతి అందాలకు, చారిత్రక ప్రదేశాలకు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు అలాగే భిన్న సంస్కృతులకు పెట్టింది పేరు. ఇటువంటి మన దేశాన్ని చుట్టేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం జాగృతి యాత్ర అనే పేరుతో ఒక ప్రత్యేక రైలును తీసుకొని వచ్చింది. జాగృతి యాత్ర ప్రత్యేక ట్రైన్ 2008 నుంచి నడుస్తుంది. కానీ దీని గురించి మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం జాగృతి రైలు ప్రధాన ఉద్దేశం. యువత ఈ రైలులో ప్రయాణించడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు, స్ఫూర్తిని పొందవచ్చు. ఈ రైలులో ప్రయాణం చేయడం ద్వారా మీరు జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు.

ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే నడుస్తుంది. ఈ రైలులో కేవలం 500 మంది మాత్రమే ప్రయాణం చేయగలరు. జాగృతి యాత్ర రైలులో ముఖ్యంగా యువతకు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన మెలకువలు నేర్పించడం జరుగుతుంది. ఈ రైలు 15 రోజులలో ఎనిమిది వేల కిలోమీటర్లు ప్రయాణించడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి ప్రారంభమయ్యే అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, మధురై చేరుకుంటుంది.

ఇక అక్కడ నుంచి ఒడిస్సాలోకి ప్రవేశించి మధ్య భారతదేశం ద్వారా తిరిగి మళ్ళీ దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటుంది. జాగృతి యాత్ర రైలు ప్రయాణం ద్వారా మీరు అనేక తీర్థయాత్ర స్థలాలతో పాటు పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది నవంబర్ నెలలో ఈ రైలు ప్రయాణం మొదలవుతుంది. కానీ ఈ రైలులో ప్రయాణం చేయాలంటే మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే ఈ రైలులో ప్రయాణించడానికి అర్హులు. ఈ ఏడాది నవంబర్ 7న ఈ రైలు ప్రయాణం ప్రారంభమై నవంబర్ 22వ తేదీన ముగుస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now