EPFO: గతంలో న్యూఢిల్లీలో ఫిబ్రవరి 28న EPFO కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్సుక్ మాండవియ అధ్యక్షతన జరిగిన 237 వ EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ ఇలా సమావేశంలో వడ్డీ రేటు పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధిపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏడు కోట్లకు పైగా ఖాతాదారుల ప్రావిడెంట్ ఫండ్ పై EPFO వార్షిక వడ్డీని జమ చేయగలదు.
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫిబ్రవరి 28వ తేదీన 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ లపై 8.25% వడ్డీ రేటును నిలుపుకోవాలని నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటుకు ఇది సమానం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం ఈ సమావేశంలో ఆమోదించబడిన వడ్డీ రేటును పంపారు.
ఈపీఎఫ్ పై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని అలాగే కార్మిక మంత్రిత్వ శాఖ EPFO కి గురువారం తెలియజేసిందని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి పి టి ఐ కి తెలిపారు.EPFO లో ఉన్న ఏడు కోట్లకు పైగా ఖాతాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించబడిన వడ్డీ రేటు ప్రకారం వడ్డీ జమ కానుందని తెలుస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.15 శాతం నుంచి 8.25 శాతానికి స్వల్పంగా పెంచడం జరిగింది. అత్యల్పస్తాయి వడ్డీ రేటు నాలుగు దశాబ్దాలకు పైగా 2020-21 లో 8.5% గా ఉండేది. మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి EPFOHO UAN అని 7738299899 కు ఎస్ఎంఎస్ చేయండి.