RBI: గతంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసిన సమయంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్లందరూ తమ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లను బ్యాంకులలో ఇచ్చి వాటికి బదులుగా కొత్త కరెన్సీ నోట్లను తీసుకోవడానికి క్యూ లైన్ లలో నిలబడి చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే ఏటీఎంలో దగ్గర కొత్త కరెన్సీ కోసం గంటల తరబడి ప్రజలు క్యూ లైన్ లో నిలబడేవారు. అటువంటి రోజులు మళ్లీ ప్రజలు ఎప్పటికీ రాకూడదు అని అనుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో అలాగే యూట్యూబ్ ఛానల్ లో వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రస్తుతం మార్కెట్లో బాగా చలామణి లో ఉన్న 500 కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ వార్తలో వైరల్ అవ్వడానికి అనేక కారణాలు ఉండొచ్చు. దీనికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన కొన్ని మాటలు కూడా కారణం కావచ్చు అని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఏమన్నారు అంటే ఈ రోజులలో ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను జరుపుతున్నారు. కాబట్టి ప్రజలకు కరెన్సీ నోట్ల అవసరం లేకుండా పోయింది. ఇటువంటి క్రమంలో పెద్ద నోట్లనో రద్దు చేయడం మంచిది. తద్వారా నల్లధనానికి మరియు ఫేక్ కరెన్సీ కి బ్రేక్ పెట్టవచ్చు అని ఆయన తెలిపారు.
ఆయన చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే సరైనదే అనిపిస్తుంది కానీ నోట్లను రద్దు చేస్తే సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. వైరల్ అవుతున్న ఈ వార్తలపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని ఫ్యాక్ట్ చెక్ విభాగం తన అధికారిక ఖాతా X లో జూన్ మూడవ తేదీన ఒక కీలకమైన పోస్ట్ చేసింది. 500 రూపాయల కరెన్సీ నోట్లు రద్దు అవుతాయి అనే వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టంగా తెలిపింది. కేంద్రం నుంచి లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన వచ్చిన సమయంలో మాత్రమే ప్రజలు ఈ వార్తలను నమ్మాలని లేకపోతే ఇటువంటి వార్తలను ప్రజలు నమ్మకూడదని కేంద్రం స్పష్టం చేసింది.