ACB RIDES: జగిత్యాల జిల్లా/ మెట్ పల్లి, జులై 30 (ప్రజా శంఖారావం): పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారుల (ACB RIDES) దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ (AEE) అనిల్ కుమార్ (ANIL KUMAR) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కోరుట్ల కు చెందిన కాంట్రాక్టర్ కు 23 లక్షల బిల్లుల మంజూరు విషయంలో పంచాయతీరాజ్ ఏఈఈ కాంట్రాక్టర్ ను 18 పదివేల రూపాయలు లంచం డిమాండ్ (DEMAND A BRIBE) చేసినట్లు ఏసీబీ అధికారులు (ACB OFFICERS) తెలిపారు.
Also Read: ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
ఈ ఒప్పందంలో సదరు కాంట్రాక్టర్ వెంకటేశం ఏఈఈ అనిల్ కుమార్ ల మధ్య పదివేల రూపాయలకు ఒప్పందం (DEAL) కుదిరినట్లు చెప్పారు. మొదటగా 3వేల రూపాయలను అడ్వాన్సుగా సదరు కాంట్రాక్టర్ (CONTRACTOR) వద్ద ఏఈఈ తీసుకోగా మిగతా ₹7వేల రూపాయలను కాంట్రాక్టర్ వద్ద నుండి తీసుకుంటున్న సమయంలో (TIME) రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు ఏఈఈ ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు (ACB OFFICERS) వెల్లడించారు. ఆయన అదుపులోకి తీసుకొని కేసు నమోదు (CASE FILE) చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.
Also Read: అక్రమకట్టడాలు @ ఆర్మూర్