Todays Gold Rate: నేడు తెలుగు రాష్ట్రాలలో తులం పసిడి ఎంతంటే..!

Todays Gold Rate
Todays Gold Rate

Todays Gold Rate: మన దేశంలో పసిడి పరుగులు ఆగడం లేదు. గత కొన్ని రోజుల నుంచి పసిడి జెడ్ స్పీడ్ లో పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం పసిడి ధరలు చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నాయి. నేడు బులియన్ మార్కెట్లో పసిడి ధర లక్ష రూపాయలు దాటింది. దీంతో సామాన్య ప్రజలు పసిడి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా కనిపించడం లేదు.

ప్రస్తుతం పెళ్లిళ్లకు, పండగలకు పసిడి కొనాలన్నా కూడా ప్రతి ఒక్కరు ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. నేడు 24 క్యారెట్ల తులం పసిడి ధరపై రూ.3 వేలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల తులం పసిడి ధరపై రూ.2,750 పెరిగినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 22, మంగళవారం రోజున బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.92,900 ఉండగా 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,01,350 గా ఉంది. తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విశాఖపట్నం మరియు విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

అలాగే పసిడితోపాటు వెండి ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వెండి ధర నేడు లక్ష రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. నిన్న కిలో వెండి పై 1000 రూపాయలు పెరిగింది. ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,01,000 గా నమోదయింది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఈరోజు కిలో వెండి రూ.1,11,000 గా ఉందని తెలుస్తుంది. అయితే ప్రాంతాలవారీగా పసిడి మరియు వెండి ధరలలో వ్యత్యాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now