Thursday, 27 March 2025, 8:13
Kamareddy

Kamareddy: నడిరోడ్డులో… భర్త చేతిలో భార్య హత్య

Kamareddy: కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 01(ప్రజా శంఖారావం):నిజాంసాగర్ చౌరస్తాలో నడి రోడ్డుపై భార్యను భర్త హత్య చేయడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఆర్ బి నగర్ లో మహేశ్వరి, నర్సింలు నివాసిస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తాలో ఉన్న మరుగుదొడ్లలో పనిచేస్తున్న భర్త నరసింహులు భార్య మహేశ్వరి ల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్పారు. శనివారం భార్యతో భర్త నర్సింలు గొడవ పడుతున్న సమయంలో తన వద్ద ఉన్న చాకుతో భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం భర్త ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, స్థానిక సీఐ చంద్రశేఖర్ రెడ్డిలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ గొడవలతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెళ్లడైందని పోలీసులు చెప్పారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *