Drinking water: శరీరంలో ఉన్న మలినాలు బయటకు పంపించేందుకు శరీరంలో కిడ్నీలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే అటువంటి కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు ఎంత మొత్తంలో నీళ్లు తాగాలో వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు కూడా తగిన మొత్తంలో నీళ్లు తాగినట్లయితే శరీరంలో ఉన్న మలినాలను కిడ్నీలు తొలగించే శరీరంలో ద్రవాల స్థాయిని బ్యాలెన్స్ చేస్తారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా తోడ్పడుతుందని అంటున్నారు. ఒక వ్యక్తి కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలంటే అతను ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు అతను ఎనిమిది నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి.
ఈ విధంగా ఎక్కువ నీరు తాగడం వలన శరీరంలో ఉన్న మలినాలు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ప్రతిరోజు ఎక్కువ నీరు తాగడం వలన కిడ్నీలో రాళ్లు, యూరినరీ ఇన్ఫెక్షన్ లో వంటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ ముదురు పసుపుపచ్చ రంగు మూత్రం, చాలా తక్కువగా ముద్రానికి వెళ్లడం, అలసట, నోరు పొడి బారడం వంటివి మీ శరీరం డిహైడ్రేషన్కు గురయింది అని చెప్పడానికి సంకేతాలు అని నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.
కనీసం రోజుకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. పరిమితికి మించి నీళ్లు ఎక్కువగా తాగినా కూడా కొన్నిసార్లు ప్రమాదానికి దారితీస్తుంది. ఒకవేళ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్లకు మించి నీళ్లు తాగినట్లయితే ఆ వ్యక్తి శరీరంలో ఉన్న ముఖ్యమైన ఖనిజాలు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఈ విధంగా పరిమితికి మించి నీళ్లు తాగడం వలన కిడ్నీలపై భారం కూడా పడే అవకాశం ఉంది. కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు కూడా పరిమితిలో మంచి నీళ్లు తాగడం చాలా మంచిది. షుగర్ ఎక్కువగా ఉన్న పానీయాలు, ఆల్కహాల్ లేదా అతిగా కెఫిన్ వంటివి తీసుకోవడం వలన కిడ్నీల ఆరోగ్యం పాడవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.