Tirumala: వేలాది మంది భక్తులు ప్రతిరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. భక్తులలో మహిళలు కూడా ఉంటారు. అయితే పండితుల అభిప్రాయం ప్రకారం మహిళలు గుండి చేయించుకోవడం సరైనదా కాదా ఇప్పుడు తెలుసుకుందాం. దేశం నలుమూలల నుంచి ప్రతిరోజు భక్తులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు చేరుకుంటారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చాలామందిభక్తులు తలనీలాలు సమర్పించుకుంటారు. మొక్కుగా చాలామంది తమ కోరిక నెరవేరిన తర్వాత గుండు చేయించుకుంటారు. మరి కొంతమంది ఎలాంటి కోరికలు లేకున్నా కూడా ఎంతో శ్రద్ధతో తలనీలాలు సమర్పిస్తారు.
తిరుమలలో పురుషులతో పాటు మహిళలు కూడా గుండు చేయించుకుంటారు. పురుషుల జుట్టు పెరగడానికి ఒక నెల సరిపోతుంది కానీ మహిళలకు పూర్తిగా జుట్టు వచ్చేందుకు మాత్రం ఒక సంవత్సరం సమయం పడుతుంది. అయినా కూడా చాలామంది మహిళలు తిరుమలలో గుండు చేయించుకుంటారు. అయితే హిందూ సంప్రదాయంలో చెప్పిన దాని ప్రకారం భర్త ఉన్నప్పుడు భార్య గుండు చేయించుకోవడం సరికాదని చెప్తున్నారు. ఈ విషయంపై గరికపాటి నరసింహారావు కూడా ఎన్నోసార్లు మాట్లాడిన సంగతి తెలిసిందే.
మహిళలు మహిళలు లాగానే ఉండాలని వాళ్లు కేవలం మూడు కత్తెర్ల వెంట్రుకలు సమర్పిస్తే సరిపోతుందని చాలామంది చెప్తున్నారు. పూర్వం రోజుల్లో గుండు చేయడం రివాజు కాకపోయిందని అలాగే ఇది శుభసూచకం కూడా కాదని అభిప్రాయపడుతున్నారు. కానీ తిరుమల పండితుల అభిప్రాయం మరోలా ఉందని చెప్పొచ్చు. స్థల పురాణం మరియు ప్రాచీన ఆచారాల ప్రకారం మహిళలు తిరుమలలో గుండు చేయించుకోవడం అభ్యంతరం లేని విషయం అని చెబుతున్నారు. మొక్కును తీర్చుకోవడమే ప్రధాన అవసరమని భావిస్తున్నారు. తిరుమలలో అర్చకులు ఎలాంటి సంకోచం లేకుండా మహిళలు తలనీలాలు సమర్పించుకోవచ్చని అంటున్నారు.