Post Office Scheme: చాలామంది ఈరోజుల్లో పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్లు రిస్క్ లేకుండా సురక్షితంగా డబ్బులు ఉండే చోట ఇన్వెస్ట్ చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వారికి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ చాలా తోడ్పడతాయి. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీ మొత్తంలో లాభాలు పొందాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్టాక్ మార్కెట్. కానీ ఇందులో ఎప్పుడు లాభాలు వస్తాయో ఎప్పుడు నష్టాలు వస్తాయో ఎవరికీ తెలియదు.
అనేక అంశాలతో మార్కెట్ ఎదుగుదల ముడిపడి ఉండడంతో చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. రిస్క్ చేయకూడదు అని అనుకున్న వాళ్ళకి ఇది సరైన ఎంపిక కాదు. సామాన్య ప్రజలు ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్లు బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీసు టర్మ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లు వంటివి చేస్తూ ఉంటారు. సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతుంది. ఈ పథకాలలో మీరు పెట్టుబడులు పెట్టి సురక్షితంగా తిరిగి డబ్బు పొందవచ్చు. ధర్మ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్లు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా పోస్ట్ ఆఫీస్ నుంచి మరో అద్భుతమైన స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.
ఉద్యోగం నుంచి పదవి విరమణ పొంది తర్వాత వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా జీవించడానికి సహాయ పడడానికి పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి తెచ్చింది. భారీ మొత్తంలో రాబడి పొందాలంటే ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ పథకంలో మీరు ప్రతిరోజు కూడా 70 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా ఆరు లక్షల రూపాయలకు పైగా పొందవచ్చు అని తెలుస్తుంది. పోస్ట్ ఆఫీస్ అందించే ఈ పీపీఎఫ్ పథకం తక్కువ సమయంలోనే మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది. ఈ పీపీఎఫ్ పథకం కేవలం 15 సంవత్సరాల లో మెచ్యూరిటీ పీరియడ్ పూర్తి అవుతుంది.