Metpally: జిల్లాల్లో పలు చోట కంపించిన భూమి

Metpally
Metpally

Metpally: మెట్ పల్లి, మే 5 (ప్రజా శంఖారావం): మూడు నుండి ఐదు సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమి కనిపించిందని, జిల్లాలో పలుచోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల జిల్లాలోనీ మెట్పల్లి, కోరుట్ల, చుట్టుపక్కల గ్రామాలలో భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు ఒకసారిగా కింద పడిపోయాయని స్థానికులు తెలిపారు. సరిగా స్వల్పంగా భూకంపం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కరీంనగర్ జిల్లాలో స్వల్పంగా భూమి కంపించిందని రిక్టర్ స్కేల్ 3.9 తీవ్రత నమోదు అయినట్లు సమాచారం. ఒక్కసారిగా భూకంపం రావడంతో కొన్నిచోట్ల ఇళ్లలోనుండి భయంతో ప్రజలు బయటకి పరుగులు తీశారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now