Tenth Class Exams: వేసవికాలం రానే వచ్చింది.ఎండలు మండిపోతున్నాయి. అలాగే ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి ప్రారంభం అయ్యాయి.ఈ పదవ తరగతి పరీక్షలను రాసేందుకు విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎండలతాపానికి పరీక్ష రాయడానికి వచ్చిన కొందరు విద్యార్థులు అక్కడక్కడ అస్వస్థతకు గురైనట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఈ వేసవిలో విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్తను తెలిపింది. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దూరప్రాంతాల నుంచి విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు మండల కేంద్రాలకు వస్తున్నారు. ప్రస్తుతం మండుతున్న ఎండలకు వేసవి తాపానికి కొందరు విద్యార్థులు అక్కడక్కడ అస్వస్థతకు గురవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రం అయి ఉన్నట్లయితే అందులో పరీక్ష రాస్తున్న ప్రతి విద్యార్థికి భోజనం పెట్టి పంపాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పదవ తరగతి పరీక్షలు ఈనెల 21న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగరం ఉన్నాయి. తాజాగా పదవ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం పై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.