Ration Card: ఇప్పటివరకు చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. అయితే అలాంటివారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. ఎప్పటినుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత పది ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదు. దీంతో చాలామందికి కొత్త రేషన్ కార్డులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు లక్షల మంది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే కొత్త రేషన్ కార్డుల జారీ ఇదిగో అదిగో అంటూ అధికారులు చెప్తున్న సంగతి తెలిసిందే. అయితే ఉగాది పండుగ నుంచి కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేస్తారని గట్టిగానే వార్తలు వినిపించాయి. కానీ అది కూడా జరగలేదు.
అర్హులైన వాళ్లకు మాత్రమే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన తర్వాత సర్వే చేసి కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన వాళ్ళని గుర్తించింది. 2025 జనవరి నెలలో ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాలలో కొత్త రేషన్ కార్డుల పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1066 కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు జారీ చేసింది. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 4,03,025 రేషన్ కార్డులు ఉన్నాయి.
వీటిలో 12 లక్షల 83 వేల 215 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. ప్రజా పాలనలో 65,205 కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. అలాగే మీ సేవలో 88,289 కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అర్హులైన వాళ్లకు మాత్రమే కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు భావిస్తుంది. సర్వే చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వాళ్లను గుర్తించింది. పూర్తి సర్వే అయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులను అర్హులైన వాళ్లకు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్కన సర్వే పూర్తయితే కని కొత్త కార్డులు రావు, ఆ తర్వాతనే కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం అందించే అవకాశం ఉంది.