Medak: చేగుంట, మార్చి 22 (ప్రజా శంఖారావం): మెదక్ జిల్లా చేగుంట పట్టణ కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలోని గల్లీలో రాత్రి పడ్డ వర్షానికి పూర్తిగా రోడ్లన్నీ బురదతో నిండిపోయినది. ఈ కాలనీలో ప్రతి సంవత్సరము ఎప్పుడు వర్షం పడ్డ ఇదే పరిస్థితి రోడ్డుపైకి మోరిలోని బురద మొత్తము చేరి వాకిట్లో నిలువ అవడంతో స్థానిక వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలను ఉదయం పూట స్కూళ్లకు తీసుకెళ్లాలంటే నరకయాతన కనబడుతుందని, స్కూల్ యూనిఫాములకు బురద చిల్లడంతో పాడవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.
అలాగే దీనివలన కాలనీ వాసులకు చాలా దుర్గంధం వేదజల్లుతున్నది అని కాలనీ వాసులు మండిపడుతున్నారు. కాలనీలో క్రిములు, కీటకాలు, దోమలు, ఈగలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని కాలనీవాసులు అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు అయినా ఏ ఒక్కరూ దీనిని పట్టించుకోవడం లేదని స్థానికులు అరోపిస్తున్నారు. కాలనీవాసులకు ఎప్పుడు దీని నుండి విముక్తి కలుగుతుందో మాకు అర్థం కావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఏ ఒక్క అధికారైనా సరే, రాజకీయ నాయకులైనా సరే పట్టించుకోని మా కాలానికి సిసి రోడ్డు, సరైన మోరి వసతులు కల్పించగలరని కోరుతున్నారు.