International Women’s Day 2025: జుక్కల్, మర్చి 08 (ప్రజా శంఖారావం): మహిళా దినోత్సవం పురస్కరించుకొని కళ నైపుణ్యానికి ఏది సాటిరాదు అన్న విధంగా కూరగాయలతో మహిళను తయారుచేసి శభాష్ అనిపించుకున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ మహిళ దినోత్సవం సందర్భంగా కూరగాయలతో వినూత్నంగా మహిళ చిత్రం తయారు చేశారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని సందేశం ఇచ్చారు. ఈ చిత్రం చూసిన పలువురు ఆయనను అభినందించారు. గతంలోను ఈయన విత్తనాలపై చిత్రాలు గీసి బాల్ కిషన్ ప్రశంసలు పొందారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now