Viral Video: పహల్గాం ఉగ్రదాడి భద్రతా లోపంపై.. చిన్న పిల్లోడి మాటలు నెట్టింట వైరల్

Viral Video
Viral Video

Viral Video: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి వెనుక కేంద్ర రక్షణ శాఖ భద్రతా వైఫల్యమే కారణమని ఓ చిన్న పిల్లోడి మాటలు ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి. కనీసం ప్రధాని మోడీ, అమిత్ షాలకు కాశ్మీర్ లో భద్రత ఏ విధంగా కల్పించాలనే అవగాహన కూడా లేకపోయిందా అంటూ ఆ పిల్లోడు ప్రశ్నిస్తున్నాడు. దాడి ఘటనను ఇంటలిజెన్స్ వర్గాలు ముందే ఎందుకు గుర్తించలేకపోయాయని ప్రశ్నల వర్షం కురుస్తుంది. జరిగిన చాలాసేపటికి ఆర్మీ జవాన్లు వెళ్లలేకపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. జరిగిన ఉగ్రదాడిలో తన తండ్రి మరణించడంతో ఆ పిల్లవాడు ప్రధాని మోడీ, అమిత్ షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

జరిగిన దాడితో రాజకీయపరంగా చదరంగం ఆడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. భద్రత కల్పించడంలో కనీసం అవగాహన వారికి లేదని పిల్లవాడు విమర్శించాడు. దేశ భద్రతలో భాగంగా పహాల్గాం పర్యాటకుల స్థలం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద మొత్తంలో భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని పిల్లవాడు ప్రశ్నించాడు. ఈ ఘటనలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని పిల్లవాడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం పిల్లవాడు చేసిన కామెంట్స్ నిట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు ఇంత చిన్న పిల్లవాడికి ఎంత గట్టి ధైర్యము ఉందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వయసులోనే ప్రశ్నించే తత్వం ఉంటే భవిష్యత్తులో ప్రశ్నించే గొప్ప నాయకుడు అవుతాడని కామెంట్లు కూడా పిల్లవాడిపై వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now