RBI: తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్న బ్యాంకులన్నీటిని సెప్టెంబర్ 2025 నాటికి 75 శాతం పేటీఎంలలో కేవలం రూ.100, రూ.200 నోట్లను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రూ.500 నోటిపై ఆధారపడటాన్ని తగ్గించే విధంగా ఉంది అంటూ పలు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 75% ఏటీఎంలో 100, 200 నోట్లు ఉండేలా చూడాలని ఆదేశించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం 500 నోటుపై ఆధారపడటాన్ని తగ్గించే విధంగా ఉంది అంటూ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ తర్వాత 500 రూపాయల నోటును రద్దు చేసే అవకాశం కూడా ఉంది అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వినీరుణ చెప్పిన దాని ప్రకారం మన దేశంలో ఉన్న అన్ని ఎటిఎంల ద్వారా ప్రజలు ఉపసంహరించుకునే నగదును కేవలం 100, 200 నోటు పెంచాలని ఆర్బిఐ తాజాగా ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలు నగదు కోసం 500 రూపాయల నోటుపై ఆధారపడటాన్ని తగ్గించే విధంగా ఈ నిర్ణయం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ప్రభుత్వం పెద్ద నోట్లపై ఆధారపడటం తగ్గించడానికి 2000 నోట్లను చలామణి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. గతంలో 2000 నోటును చలామణి నుంచి తొలగించినట్లే ప్రభుత్వం 500 రూపాయల నోటును కూడా చలామణి నుంచి తొలగిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలదు. కానీ ఇది ఇప్పుడు జరగచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ వచ్చే ఏడాది జరిగితే అది పెద్ద విషయం కూడా కాకపోవచ్చు అంటూ రానా చెప్తున్నారు. అలాగే రానా మాట్లాడుతూ దేశంలో ఎక్కడ చూసినా డిజిటల్ లావాదేవీలు వేగంగా జరుగుతున్నాయని ఈ క్రమంలో ప్రభుత్వం డిజిటల్ ఈ రూపాయి కరెన్సీని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుందంటూ తెలిపారు. ప్రభుత్వం నోట్లను ముద్రించాలి అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చిన్న నోట్లను అన్ని ఏటీఎంలలో ఎక్కువగా చలామణిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను ఆయన తెలిపారు.