Municipal Officer’s: ప్రాపర్టీ టాక్స్ బకాయి ఉన్న సీడ్స్ కంపెనీ సీజ్

Municipal Officer's
Municipal Officer's

Municipal Officer’s: ఆర్మూర్ టౌన్, మార్చి 19 (ప్రజా శంఖారావం): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మారుతి సీడ్స్ కంపెనీ గత రెండు సంవత్సరాలుగా ప్రాపర్టీ టాక్స్ బకాయి ఉండడంతో బుధవారం మున్సిపల్ కార్యాలయం మేనేజర్ హయూమ్ సిబ్బందితో కలిసి సీడ్స్ కంపెనీని సీజ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజు ఆదేశాల మేరకు బకాయి ఉన్న సీడ్స్ కంపెనీనీ సీజ్ చేశామని ఆయన చెప్పారు. ఈ సీడ్స్ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు కొనసాగించరాదని ఆయన సూచించారు.

ఒకవేళ ఎవరైనా లావాదేవీలు కొనసాగించాలనుకుంటే మున్సిపల్ కు బకాయి ఉన్న ప్రాపర్టీ టాక్స్ ని పూర్తిగా చెల్లించిన తర్వాత లావాదేవీలను నిబంధనల మేరకు మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకుని జరిపించుకోవచ్చని ఆయన వివరించారు. పలుమార్లు మారుతి సీడ్స్ కంపెనీ యజమానికి మున్సిపల్ కార్యాలయం నుండి నోటీసులు పంపించిన ఎలాంటి సమాధానం రాలేదని, దీంతో పై అధికారుల ఆదేశాల మేరకు సీడ్ కంపెనీనీ సీజ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now