Cement Prices: కొత్తగా ఇల్లు కట్టేవారికి షాక్.. భారీగా పెరిగిన ధరలు

Cement Prices
Cement Prices

Cement Prices: రానున్న రోజుల్లో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా సిమెంట్ పై కొత్తగా మినరల్ టాక్స్ విధించే పనిలో ఉన్నాయి. సామాన్యులకు కొత్త ఇల్లు నిర్మించుకుంటున్న వాళ్లకి ఇది చేదు వార్తా అని చెప్పొచ్చు. త్వరలో సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కొన్ని రాష్ట్రాలు సిమెంట్ పై మినరల్ టాక్స్ విధించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీని ఫలితంగా నిర్మాణ ఖర్చులు పెరగబోతున్నాయి. హౌసింగ్ మార్కెట్ ను కూడా పెరుగుతున్న సిమెంట్ ధరలు ప్రభావితం చేయవచ్చు. 2024వ సంవత్సరం జూలై నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రాలు రాయల్టీ లతో పాటు ఖనిజ హక్కులు మరియు ఖనిజాలను కలిగి ఉన్న భూములు పై పనులు విధించడానికి అనుమతి ఇచ్చింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఖనిజ పనులను ప్రవేశ పెడుతున్నాయి. ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సిమెంటు ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కీలకమైన పదార్ధం సున్నపురాయిపై 160 రూపాయలు టన్నుకు టాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువ ఆదాయాన్ని ఖనిజ వనరుల నుంచి సంపాదించడానికి రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్లో భాగంగా కొత్త టాక్స్ రూల్స్ ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో సిమెంట్ కంపెనీలు ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.

త్వరలో కొన్ని కంపెనీలు సిమెంట్ ధరలను కూడా పెంచబోతున్నాయి. సిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు మరియు హౌసింగ్ కన్స్ట్రక్షన్ కి ముఖ్యమైన అవసరం అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ దీని ధరలు పెరిగితే నిర్మాణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే సిమెంట్ పరిశ్రమ హై ఫ్యూయల్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తో ఇబ్బంది పడుతుంది. ప్రస్తుతం ఈ వార్త కూడా సిమెంట్ పరిశ్రమకు సవాలుగా మారనుంది. తమిళనాడు రాష్ట్రంలో బ్యాగ్ ఎనిమిది నుంచి పది రూపాయల వరకు సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో పోటీ కారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రంలో సిమెంట్ ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో కంపెనీలు అదనపు ఖర్చులను భరించడం కష్టమని చెప్పొచ్చు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now