Student suicide: బాన్సువాడ ఆగష్టు 31 (ప్రజా శంఖ రావం): కామారెడ్డి జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ ఫుడ్ అండ్ టెక్నాలజీ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రక్షిత వసతిగృహం బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు విషయాన్నీ హాస్టల్ అధికారులకు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హుస్నాపూర్ గ్రామానికి చెందిన లింగావడ్ రక్షిత ఐదు రోజుల క్రితమే కళాశాల వసతి గృహంలో చేరింది. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హాస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ జయేశ్ రెడ్డి, ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now