Pooja Hegde: పూజా హెగ్డె తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుత తరం అగ్ర హీరోలందరితో నటించింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయినా కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈ మధ్య తెలుగులో సినిమాలు తగ్గినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఆమెను మరిచిపోలేరు. పూజా హెగ్డె హీరోయిన్ గా సూర్య హీరోగా రాబోతున్న మూవీ ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఇటీవల జరిగింది.
సాధారణంగా హీరో హీరోయిన్లు, మెయిన్ క్యారెక్టర్లు ప్రీరిలీజ్ ఈవెంట్ కు వస్తుంటారు. కానీ రెట్రో ఈవెంట్ కు మాత్రం పూజా హెగ్డె హైదరాబాద్ కు రాలేదు. దీంతో ఈమె రాకపోవడం వెనక బలమైన కారణాలు ఉన్నాయని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు మిస్ కాకుండా వచ్చే పూజా రాకపోవడంతో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజా హెగ్డె తెలుగు సినిమాలతో నే పాపులరిటీ సంపాదించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇలా రాకపోవడానికి పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
కారణమిదేనా..
మహేశ్ బాబుతో మొదట్లో గుంటూరు కారం సినిమాలో పూజా హెగ్డె ను హీరోయిన్ గా అనుకున్నారని ఆ తర్వాత అంతా ఫిక్స్ అయిపోయాక సడెన్ గా ఆమెను తీసేశారంటా.. అదే పంచాయితీ వల్ల రెట్రో మూవీ ఈవెంట్ కు రాలేదని తెలుస్తుంది. అసలు గుంటూరు కారం సినిమాకు ఈ రెట్రో ఈవెంట్ కు ఏంటీ సంబంధం అని చూస్తే అసలు విషయం బయటపడింది.రెట్రో సినిమా ఈవెంట్ ను సితార ఎంటర్ టైన్ మెంట్ నాగవంశీ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. గుంటూరు కారం సినిమా హరిక హాసిని ఎంటర్ టైన్ మెంట్ కూడా దాదాపు ఒక్కరివే అని తెలుస్తుంది. దీంతో తనకు సినిమా అవకాశం ఇవ్వకుండా మధ్యలోనే తీసేసిన వారు నిర్వహిస్తున్న ఈవెంట్ కు తాను ఎలా వెళతానని పూజా హెగ్డ్ అనుకుని మరీ రాలేనట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.
అయితే తనను కాదని శ్రీలీలను హీరోయిన్ గా గుంటూరు కారంలో ఎంపిక చేయడంపై అలకబూనిన పూజా హెగ్డె ఈ సినిమాఈవెంట్ ను సితార ఎంటర్ టైన్మెంట్ నిర్వహించడంతో రాలేనట్లు తెలుస్తోంది. దీంతో పూజా హెగ్డె ను తెలుగు లో కావాలనే తొక్కేశారని అందుకే ఇటు వైపు రావడానికి కూడా ఆమె అస్సలు ఇష్టపడటం లేదని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.