Todays Gold Rate: మనదేశంలో పసిడి ధరలు సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి పసిడి ధరలు చేరడంతో బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన తులం పసిడి ధర తొలిసారిగా లక్ష మార్కును దాటింది. పెరుగుతున్న పసిడి ధరలు సామాన్య ప్రజలను భయపెడుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలి అంటే లక్ష రూపాయలు దగ్గర పెట్టుకోవాల్సిందే. లక్ష రూపాయలు కంటే ఎక్కువ డబ్బులను రెడీగా పెట్టుకోవాలి. ఈరోజు పసిడి ధర రిటైల్ మార్కెట్లో లక్ష మార్కును క్రాస్ చేసింది. గతంలో 50 వేలకు తులం ఉన్న పసిడి ధరలు ఇప్పుడు డబల్ అయ్యాయి.
త్వరలో అక్షయ తృతీయ సమీపిస్తుండడంతో పసిడి మెరుపులు మెరుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త మైలురాయిని చేరిన పసిడి ధరలు కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో పసిడి కొనాలంటే వెనుకడుగు వేస్తున్నారు. తొలిసారిగా రిటైల్ మార్కెట్లో పసిడి లక్ష రూపాయలు దాటింది. హైదరాబాద్ లో ఒక్కరోజే రూ.2,562 పెరిగి 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,02,062 కు చేరుకుంది.
లైవ్ మార్కెట్లో కూడా పసిడి ధర 1,02,000 పైగా ఉంది. ఇక ఎంసీఎక్స్ లో కూడా పసిడి ధర రూ.1700 పెరిగింది. అమెరికాలో జరిగిన తాజా పరిణామాలతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరుతో ఔన్స్ పసిడి ధర 3490 డాలర్లు దాటింది. పసిడి పరుగుకు డాలర్ బలహీనత కూడా ఒక కారణం అవుతుంది. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్టానికి పడిపోవడం జరిగింది. తాజాగా ఫెడ్ నిర్ణయాలపై డోనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో ఇన్వెస్టర్లకు భయం మొదలైంది. ఈ క్రమంలో పసిడి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజాగా తులం పసిడి ధర అక్షరాలా లక్ష రూపాయలను క్రాస్ చేయడంతో పసిడి ధరలు మైలు రాళ్లను కూడా ఓసారి తెలుసుకుందాం. మొదటిసారి 1959లో పసిడి ధర 100 రూపాయల మార్క్ చేరుకుంది. ఇక ఆ తర్వాత 1979లో 1000 రూపాయలు మార్క్ పసిడి చేరుకుంది. 2007లో మొదటిసారి పదివేల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుంది బంగారం ధర. ఇక తర్వాత ఆగస్టు 2011లో మొదటిసారిగా 25వేల మార్క్ పసిడి టచ్ చేసింది. జూలై 2020లో తులం పసిడి ధర 50,000 దాటింది. ఇక ఈ ఏడాది జనవరి నెలలో తులం పసిడి ధర 78 వేల రూపాయలు చేరుకుంది. ఈరోజు 24 క్యారెట్ల తులం పసిడి ధర లక్ష రూపాయలకు టచ్ చేసింది.
కేవలం 3 నెలలలో పసిడి ధరలు లక్ష రూపాయలను తాకాయి. మనదేశంలో పెళ్లిళ్లు మరియు పండగల సీజన్ కావడంతో పసిడికి మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల కారణంగానే పసిడి ధరలు పెరగడం తగ్గడం జరుగుతాయి. ఉదాహరణకు చెప్పాలంటే డాలర్ బలహీన పడుతుంది అనే వార్తతో ప్రపంచం వనికిపోయి పసిడిని కొనుగోలు చేస్తుంది. ఈ రోజుల్లో కూడా ఇన్వెస్టర్ల భయాలు పోవడం లేదు. దాంతో ఈ క్రమంలో పసిడి ధర స్పీడ్ గా పెరుగుతుంది.