Metpally: మెట్ పల్లి/జగిత్యాల, మే7 (ప్రజా శంఖారావం): జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని ఏబీ కన్వెన్షన్లో జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం రసాభాసగా కొనసాగింది. సమావేశంలో కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు వర్గం, సుజిత్ రావు వర్గం కార్యకర్తల మధ్య వాగ్వివివాదం చోటు చేసుకోవడంతో సమావేశం కాసేపు రసాభాస కొనసాగింది.
కోరుట్ల నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం పై నర్సింగారావు వర్గం అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ స్టేజిపై కూర్చోవడంతో వివాదం చెలరేగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జోక్యంతో వివాదం సద్దుమనిగిన, సుజిత్ రావు వర్గీయులు సమావేశం నుండి బయటికి వెళ్లిపోయారు. అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాస్థాయిలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన వర్గపోరుతో సమావేశం రసాభాసగానే ముగిసింది.