Aadhar Card: దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా తప్పనిసరి అయింది. మరి అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా.. ఆధార్ కార్డులో తప్పులను సరిదిద్దుకోవడానికి 5 రాష్ట్రాల ప్రజలకు మరి తిప్పలు తప్పడం లేదా… ఆధార్ లో ఉన్న చిన్నచిన్న పొరపాట్లను సరి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 5రాష్ట్రాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ కేంద్రంలోని రీజినల్ ఆధార్ కార్యాలయం చుట్టూ ప్రతినిత్యం 5 రాష్ట్రాలకు చెందిన జనాలు ప్రదక్షణలు వేస్తున్నారు. గంటలకొద్దీ వేచి ఉన్న పని కాకపోవడంతో జనం విసిగిపోతున్నారు. ఎన్నో రోజులు సంధి ఆధార్లో ఉన్న తప్పిదాలను సరి చేసుకుందాం అని చూస్తున్న.. జనానికి ఆగి.. ఆగి.. జ్వరం వస్తుంది. కానీ ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వాలు శ్రద్ధ వహించడం లేదని జనం గగ్గులు పెడుతున్నారు.
ముఖ్యంగా ఆధార్ కార్డులో ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు ఉన్న చిన్న పిల్లలకు వేలిముద్రలను అప్డేట్ చేసుకుందామని, స్థానిక ఆధార్ సెంటర్లు, మీసేవ సెంటర్లకు వెళితే పని అయిపోతుంది. కానీ 15 ఏళ్లు దాటిన తర్వాత స్థానికంగా ఉన్న ఆధార్ సెంటర్లలో తప్పులు సరిచేసుకునే అవకాశం లేకపోవడంతో హైదరాబాదులోని రీజినల్ ఆధార్ కార్యాలయం చుట్టూ జనాలు ప్రదక్షిణలు వేయడం తప్పడం లేదు. 15 ఏళ్లు పైబడిన తర్వాత హైదరాబాదులోని ఆధార్ రీజినల్ సెంటర్ లో మాత్రమే ఇంటిపేరు, పుట్టిన తేదీ, ఆడ మగ, కండ్ల ఐరిస్, ఫింగర్ ప్రింట్లు, పేర్లు వంటివి అప్డేట్ చేసుకోవడానికి (యుఐడిఏఐ) యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను విధించింది. కానీ ఇంటిపేరు, పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ పేరు తప్పిదాలను రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. కానీ ఆడ మగ, పుట్టిన తేదీ ఒక్కసారి మాత్రమే సరి చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అడ్రస్, మొబైల్ నెంబర్, ఇమెయిల్, ఫోటో, కండ్ల ఐరిస్, ఫింగర్ ప్రింట్ లో ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకునే నిబంధనలు కల్పించింది. మళ్ళీ వీటిలో లిమిట్ దాటినంక స్థానికంగా ఉన్న ఆధార్ అప్డేట్ సెంటర్లలో అవకాశం లేదు. అలాంటి వాళ్ళందరూ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవడానికి హైదరాబాదులోని రీజినల్ సెంటర్ కి రావాల్సి ఉంటుంది. అయితే ఆధార్ సెక్యూర్ గా ఉండాలంటే మాత్రం అప్డేట్ చేసుకుంటేనే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
దీని కోసమని 5 రాష్ట్రాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ అమీర్ పేట్ లో ఉన్న ఆధార్ రీజినల్ సెంటర్ కు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, చతిస్ ఘడ్, ఒడిస్సా, అండమాన్ నికోబార్ ప్రజలు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే హైదరాబాదుకు రావాల్సిందే. 5 రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ ఆధార్ కార్డులో తప్పొప్పులను సరి చేసుకోవాలంటే వేలాదిగా ఈ కార్యాలయానికి తరలిరావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పొద్దుగల్ల ఈ కార్యాలయానికి వచ్చిన వారికి టోకెన్లను అందజేస్తారు. క్రమ సంఖ్య ప్రకారం 250 మందికి ఒక్కరోజుకు ఈ టోకెన్లను ఇక్కడ జారీ చేస్తారు. వేల సంఖ్యలో వచ్చే వారికి కేవలం రోజుకు 250 మందికి మాత్రమే ఆధార్ లో ఉన్న తప్పులను సవరణ చేయడంతో చాలామంది వాళ్ల నెంబర్ అచ్చేంత వరకు వేచి ఉండక తప్పడం లేదు. అంత దూరం నుండి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లి వచ్చేసరికి టైం వృధా అవుతుందన, దగ్గర్లో ఉన్న లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. మళ్లీ పొద్దున్నే లేచి టోకెన్ల కోసం లైన్ లో బారులు తీరుతున్నారు. వచ్చిన పని చేసుకొని వెళ్లేంతవరకు జనాలకు పడిగాపులు తప్పడం లేదు.
ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడంలేదని రీజినల్ కార్యాలయానికి వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతసేపు లైన్ లో ఉండి టోకెన్ వచ్చిన టోకెన్ తో లోపలకి వెళితే పనులు మాత్రం కావడంలేదని వాపోతున్నారు. పుట్టిన తేదీ, ఫింగర్ ప్రింట్లు, ఇంటిపేరు, పేరులో తప్పిదాలు ఉంటే ఏళ్ల కొద్ది అధికారులు తిప్పుతున్నారని జనం మండిపడుతున్నారు. ఇదేంటని అడిగితే అప్డేట్ అవుతుందని, కొన్ని రోజులు టైం పడుతుందని కుంటి సాకులు చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ మధ్యలో ఉన్న దళారులను పట్టుకొని పోతే మట్టుకు ఎంత లేట్ అయిన టోకెన్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండానే లోపట్లో సిబ్బంది పనులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. దీనికి తోడు ఏదైనా పైరవీకారులతో ఈ కార్యాలయానికి వస్తే పనులు పూర్తవుతున్నాయని కూడా వినబడుతుంది. సాధారణంగా సదా..సీదా.. జనానికి మాత్రం తిప్పలు తప్పడం లేదు అన్నది నగ్నసత్యం. ఆధార్ లో చిన్న చిన్న పొరపాట్లు ఉండడంతో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కూడా కోల్పోతున్నామని కొందరు బాధను వెళ్లగక్కుతున్నారు. ఏళ్ల తరబడి రీజనల్ కార్యాలయం చుట్టూ తిరిగిన తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వాలు స్పందించి పరిష్కారం దిశగా ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు.