Indiramma House: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పేదల సొంత ఇంటి కల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శ్రీరామనవమి తర్వాత ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నాలుగు లక్షల ఇళ్లకు అనుమతిని మంజూరు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కల దగ్గర పడే రోజులు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ మేరకు ఒక కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కార్యరూపం చేపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని వేలాది మంది పేద కుటుంబాలకు ఇది నిజమైన పండుగ కానుక అని చెప్పొచ్చు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన ఒక గొప్ప హామీ ఇందిరమ్మ ఇల్లు పథకం అని తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు నిజంగా ఇంటి కలను నెరవేర్చే అవకాశం కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాలను కూడా విడుదల చేశారు. శంకుస్థాపన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలివిడతగా 2025 ఫిబ్రవరి 21వ తేదీన నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో 72,045 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నిర్మాణాలు శ్రీరామనవమి పండుగ తర్వాత ప్రారంభం కాబోతున్నాయి అని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని చర్యలను తీసుకున్నట్లు తెలుస్తుంది. మంత్రి లబ్ధిదారుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మెతో ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ జరుగుతుందని సమాచారం. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.