CM Revanth Reddy: ప్రజా శంఖారావం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేనెల ఏప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ టూర్ కన్ఫామ్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే ఉద్దేశంతో సీఎం రేవంత్ జపాన్ పర్యటనకు వెళ్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. దావోస్ పర్యటన విజయవంతంగా ముగియడంతో రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులపై జపాన్ కంపెనీలకు వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే ఉద్దేశంతో ఈ పర్యటనకు సీఎం వెళుతున్నట్లుగా తెలుస్తోంది. జపాన్ సంస్థల పెట్టుబడులతో రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పెరగడంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now