JOBS: మనదేశంలో అధునాతన సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించిన ఈ రైలు గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చాలా అనుభవం కలిగిన లోకో పైలట్లో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడుపుతూ ఉంటారు. అయితే వందే భారత రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంత ఉంటుంది.. అలాగే ఆ ఉద్యోగానికి కావలసిన అర్హతలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నడిపే లోకో పైలట్ జీతం నెలకు రూ.55,000 నుంచి రూ.85,000 వరకు ఉంటుంది. అలాగే ఈ జీతం టి ఏ, డి ఏ లతోపాటు ఓవర్ టైం, రన్నింగ్ అలవెన్స్లు, నైట్ డ్యూటీ అలవెన్సులు అన్ని కలిపి ఉంటాయి. అలాగే వాళ్లకు అదనంగా పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలను కూడా రైల్వే అందిస్తారు. సీనియారిటీ మరియు ప్రమోషన్లను బట్టి జీతం మరింత ఎక్కువగా పెరుగుతుంది. కొంతమంది నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటారు.
అయితే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో నేరుగా లోకో పైలట్ అయ్యే అవకాశం ఉండదు. ముందుగా వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్గా తమ కెరియర్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ కావాలంటే వాళ్ళు పదవ తరగతి పాస్ అయి ఉండాలి. పదవ తరగతితో పాటు వాళ్లు ఐటిఐ సర్టిఫికెట్ లేదా ఇంజనీరింగ్ డిప్లమా చేసి ఉండాలి. వాళ్లు ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్లో ఏదో ఒక డిప్లమా చేసి ఉండాలి. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ కు అర్హులు. అలాగే రైల్వే నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీలకు వయసు విషయంలో సడలింపులు ఉంటాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత రాత పరీక్షలో సెలెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్లకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే ఉద్యోగం వస్తుంది. అన్ని పరీక్షలు పాస్ అయిన తర్వాత శిక్షణ అందిస్తారు.