Helping Hands : కామారెడ్డి జిల్లా, మార్చి 20 (ప్రజా శంఖారావం): డాక్టరేట్ పట్టా పొంది తన ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన లోనే క్రాంతి రాజు పి హెచ్ డి విద్యార్థికి హెల్పింగ్ హాండ్స్ ఉద్యోగులు బుధవారం ఆర్థిక సాయం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం చేతుల మీదుగా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు తులసీదాస్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ ప్రేమ్ లు ₹ 25వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో విద్యార్థికి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ పేద విద్యార్థులకు అత్యవసరమైన సమయంలో ఆర్థిక సాయం చేస్తూ ఆపన్న హస్తం అందించిన హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామేశ్వర్ రావు, ప్రొఫెసర్ భీమ్ రాజు, హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యోగులు ప్రొఫెసర్లు అరుణ్, రామకృష్ణ, శంకర్ మాంగ్, కళ్యాణ్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.