DEVOTIONAL: విష్ణువు అన్ని అవతారాలలో కూడా ఉగ్రరూపం నరసింహస్వామి అవతారం అని అందరికీ తెలుసు. ప్రతి ఏడాది కూడా మహిమాన్వితమైన నరసింహస్వామి అవతారం దాల్చిన రోజునే నరసింహస్వామి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహుడు హిరణ్యకశిపు అనే రాక్షసుడిని ఈరోజున చంపాడు. నరసింహస్వామి జన్మదినోత్సవం రోజున భక్తులు ఉపవాసముండి పూజలు చేసి, ప్రత్యేక నియమాలను పాటించే ఆ నరసింహస్వామి ఆశీర్వాదం అందుకుంటారు.
అయితే హిందూ మత శాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వలన చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఆ స్వామి కోపంగా ఉంటాడని వారు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని చెప్తారు. పంచాంగ శాస్త్రం ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి తిధి మే 10వ తేదీన సాయంత్రం 5: 29 గంటలకు మొదలవుతుంది. ఇది మే 11 రాత్రి 9:19 కు ముగుస్తుంది. కాబట్టి ఈ ఏడాది మే 11వ తేదీన నరసింహ జయంతిని అందరూ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు కూడా తమ మనసును ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంచుకోవాలి.
ఈ రోజున మీరు ఎవరితోనైనా కోపంగా మాట్లాడడం లేదా మనసులో ప్రతికూల ఆలోచనలను కలిగి ఉండటం వంటివి చాలా అశుభ్రంగా పరిగణించబడతాయి. ప్రకృతి రీత్యా నరసింహ స్వామి ఉగ్ర స్వరూపం కావచ్చు కానీ ఆయన శాంతి, భక్తి తత్వాన్ని ఇష్టపడతారు. ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మొత్తం నరసింహ స్వామి దేవునికి అంకితం చేయబడింది. మానసిక అలాగే శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ పవిత్ర రోజున వృద్ధులను లేదా బలహీనులను అసలు అవమానించకూడదు. సకల జీవుల్లో కూడా నరసింహస్వామి ఉన్నాడు. కాబట్టి ఎవరినైనా అవమానించినట్లయితే నరసింహ స్వామికి కోపం వస్తుంది.