DEVOTIONAL: పొరపాటున కూడా నరసింహ స్వామి జయంతి రోజున ఈ తప్పులు చేయకూడదు.. లేకపోతే సమస్యలు తప్పవు

DEVOTIONAL
DEVOTIONAL

DEVOTIONAL: విష్ణువు అన్ని అవతారాలలో కూడా ఉగ్రరూపం నరసింహస్వామి అవతారం అని అందరికీ తెలుసు. ప్రతి ఏడాది కూడా మహిమాన్వితమైన నరసింహస్వామి అవతారం దాల్చిన రోజునే నరసింహస్వామి జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహుడు హిరణ్యకశిపు అనే రాక్షసుడిని ఈరోజున చంపాడు. నరసింహస్వామి జన్మదినోత్సవం రోజున భక్తులు ఉపవాసముండి పూజలు చేసి, ప్రత్యేక నియమాలను పాటించే ఆ నరసింహస్వామి ఆశీర్వాదం అందుకుంటారు.

అయితే హిందూ మత శాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం వలన చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఆ స్వామి కోపంగా ఉంటాడని వారు తమ జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని చెప్తారు. పంచాంగ శాస్త్రం ప్రకారం వైశాఖ మాసంలో శుక్లపక్ష చతుర్దశి తిధి మే 10వ తేదీన సాయంత్రం 5: 29 గంటలకు మొదలవుతుంది. ఇది మే 11 రాత్రి 9:19 కు ముగుస్తుంది. కాబట్టి ఈ ఏడాది మే 11వ తేదీన నరసింహ జయంతిని అందరూ జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు కూడా తమ మనసును ప్రశాంతంగా మరియు సానుకూలంగా ఉంచుకోవాలి.

ఈ రోజున మీరు ఎవరితోనైనా కోపంగా మాట్లాడడం లేదా మనసులో ప్రతికూల ఆలోచనలను కలిగి ఉండటం వంటివి చాలా అశుభ్రంగా పరిగణించబడతాయి. ప్రకృతి రీత్యా నరసింహ స్వామి ఉగ్ర స్వరూపం కావచ్చు కానీ ఆయన శాంతి, భక్తి తత్వాన్ని ఇష్టపడతారు. ఈ పవిత్రమైన రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసం, మద్యం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈరోజు మొత్తం నరసింహ స్వామి దేవునికి అంకితం చేయబడింది. మానసిక అలాగే శారీరక స్వచ్ఛతను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ పవిత్ర రోజున వృద్ధులను లేదా బలహీనులను అసలు అవమానించకూడదు. సకల జీవుల్లో కూడా నరసింహస్వామి ఉన్నాడు. కాబట్టి ఎవరినైనా అవమానించినట్లయితే నరసింహ స్వామికి కోపం వస్తుంది.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now