UPI New Rules: చాలామంది యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటారు. అయితే యూపీఐ పై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలో అమలులోకి వస్తాయని తెలుస్తుంది. తాజాగా వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇప్పుడు డేటాబేస్ ను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలి. డి ఆక్టివేట్ చేసిన నెంబర్లను లేదా వేరొకరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్లను అధికారులు జాబితా నుండి తొలగించాలి. ఎంపీసీఐ ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది. యూపీఐ నెంబర్ ఆధారిత లావాదేవీలను ఇది సులభతరం చేస్తుందని తెలుస్తుంది. అలాగే సురక్షితంగా కూడా చేస్తుంది.
ఎంపీసీఐ యూపీఐ లావాదేవీల గురించి కస్టమర్లకు హెచ్చరించడానికి ఇప్పటివరకు అనేక వర్క్ షాప్ లను కూడా నిర్వహించింది. తాజాగా ఏర్పడిన కొత్త మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులో అలాగే చెల్లింపు సేవా ప్రదాతలు తమ డేటాబేస్ లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం తప్పనిసరిగా చేసింది. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫార్మ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. తాజాగా వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం యూపీఐ నెంబర్లను ఫీడింగ్ లేదా పోర్టు చేయడానికి వినియోగదారుని అనుమతి తప్పనిసరి. డిఫాల్ట్ ఎంపికను ఆఫ్ లో ఉంచారు.
స్వయంగా వినియోగదారుడు ఎంచుకోవలసి ఉంటుంది. యూపీఐ ఆప్ వినియోగదారులకు పంపిన సందేశం చాలా స్పష్టంగా ఉండాలని తెలిపింది. అందులో ఎటువంటి ఖాళీలు ఉండవు. అలాగే సమ్మతిని తప్పుదారి పట్టించడానికి లేదా బలవంతం చేయడానికి కూడా ప్రయత్నించకూడదు అని తెలిపింది. లావాదేవీ చేస్తున్న సమయంలో ఎటువంటి సమ్మతిని కూడా పొందలేము. ఈ క్రమంలో మేపర్ ప్రతిస్పందన సకాలంలో అందకపోతే పిఎస్పీ యాప్ ఆ నెంబర్ను స్వయంగా ధ్రువీకరిస్తుంది. అలాంటి సందర్భంలో ప్రతినెలా ఎంపీసీఐ కి నివేదించాలి అని ఎన్పీసీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలను మార్చి 31, 2025 నాటికి సభ్యులు అందరూ పాటించాలి అని సూచించింది.