Gold Rate Today: బంగారం కొనేవారికి శుభవార్త.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం బంగారం ఎంతంటే..
మన దేశంలో పసిడికి చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మన దేశ మహిళలు అయితే పసిడిని ఎంతో ఇష్టపడతారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇలా సందర్భం ఏదైనా కూడా అందరికీ ముందుగా గుర్తొచ్చే ఆభరణం బంగారమే. డబ్బులు పొదుపు చేసి మరి మహిళలు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనడానికి మాత్రమే కాకుండా బంగారాన్ని మంచి పెట్టుబడిగా కూడా చాలామంది భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిందని చెప్పొచ్చు.
చాలామంది ప్రతి రోజు కూడా బంగారం మరియు వెండి ధరలను తెలుసుకుంటూ ఉంటారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ వెళ్తున్నాయి. పసిడి కొనుగోలు చేయాలని చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కు బట్టి వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న బంగారు ధరలతో పాటు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వలు మరియు వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఏప్రిల్ 15, 2025 బంగారం మరియు సిల్వర్ ధరలు తెలుగు రాష్ట్రాలలో ఈ విధంగా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్ తో సహా పలు నగరాలలో ఈరోజు పసిడి మరియు వెండి ధరలు ఇలా ఉన్నాయి..
నేడు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87,540, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.95,500 గా ఉన్నాయి. ఈరోజు పసిడి మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలు ప్రధాన నగరాలు రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ మరియు ప్రొద్దుటూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయని సమాచారం.
ఈరోజు ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,690, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,650 గా ఉన్నాయి.
నేడు ముంబైలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.87,540, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,500 గా ఉన్నాయి.
ఈరోజు చెన్నై నగరంలో 22 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.87,540, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రు.95,500 గా ఉన్నాయి.
పురాతన కాలం నుంచి కూడా పసిడి తర్వాత చాలా విలువైన లోహం గా బాగా ప్రసిద్ధి చెందింది వెండి. వెండిని ఎక్కువగా ఆభరణాలు, నాణేలు, వంట పాత్రల తయారీలో ఉపయోగిస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలలో, రసాయనిక చర్యలలో ఉత్ప్రే రకంగా కూడా వాడుతున్నారు.
వివాహది వేడుకలలో కూడా పసిడి తర్వాత వెండికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలామంది ప్రతిరోజూ పసిడి ధరలతో పాటు వెండి ధరలను కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు పసిడి ధర లోనే వెండి కూడా స్వల్పంగా దిగి వచ్చింది. హైదరాబాద్ తో సహా వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో కిలో వెండి ధర ఈరోజు రూ.1,09,800 గా నమోదయింది.