10th Class Result Date 2025: పదవ తరగతి పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అయిన తర్వాత ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుందని తెలుస్తుంది. అనుకున్న టార్గెట్ తేదీలోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసేందుకు హడావిడిగా జవాబు పత్రాలను దిద్దుతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఏప్రిల్ ఏడవ తేదీ నుంచి జవాబు పత్రాలు మూల్యాంకనం ప్రారంభం అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం ఏప్రిల్ 15వ తేదీతో ముగుస్తుంది అని చెప్తున్నారు. అయితే అనుకున్న తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు హడావిడిగా పేపర్లను దిద్దుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో టీచర్లు ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్లు గోల పెడుతున్నారు. మరి కొన్నిచోట్ల 45 నుంచి 60 వరకు పేపర్లను దిద్దిస్తున్నారు అనే ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రతి టీచర్ కు 40 జవాబు పత్రాలు ఇవ్వడానికి బదులుగా గరిష్టంగా జవాబు పత్రాలను దిద్దిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాదు నగరంలో 50 పేపర్లు దిద్దిస్తున్నారని, సిద్దిపేట జిల్లాలో 45 నుంచి 50 వరకు జవాబు పేపర్లు ఇస్తున్నారు అంటూ టీచర్లు చెప్తున్నారు. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల 15వ తేదీ లోపు మూల్యాంకనాన్ని పూర్తి చేయవలసి ఉండగా కొన్ని జిల్లాలలో సోషల్ మరియు ఇంగ్లీష్ పేపర్ల మూల్యాంకనం ఇంకా పూర్తి కాలేదంటూ సమాచారం. ఈ క్రమంలో మూల్యాంకనం ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఒక్క టీచర్కు రోజుకు 50 పేపర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏప్రిల్ 15వ తేదీ లోపు మూల్యాంకన ప్రక్రియ పూర్తి కాకపోతే ఫలితాల వెల్లడి ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ తాజా పరిణామాల ప్రకారం ఏప్రిల్ చివరి కాలంలో విడుదలయ్యే ఫలితాలు మరి కాస్త ఆలస్యంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.