NHAI: రెండు రాష్ట్రాలకు తీపి కబురు.. రాష్ట్రాలను కలుపుతూ త్వరలో తెలంగాణలో కొత్త వంతెన ప్రారంభం

NHAI
NHAI

NHAI: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదిపై మరొక వంతెన నిర్మాణం జరుగుతుంది. ఈ వంతెన నారాయణపేట జిల్లాలో తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ నిర్మాణం జరుగుతుంది. ఈ కొత్త వంతెన నిర్మాణం నారాయణపేట జిల్లా వాసునగర్, కర్ణాటక శక్తి నగర్ మధ్య నిర్మించబడుతుంది. మూడేళ్ల కిందట ఈ వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఏడాదిలోగా ఈ వంతెన పనులను పూర్తిచేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు. అనుకున్న సమయానికి ఈ వంతెన నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తే ఆ ప్రాంతాలలో రవాణా, వాణిజ్య మరియు వ్యాపార కార్యకలాపాలు చాలా మెరుగుపడతాయి. కృష్ణానది మీద ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది.

కృష్ణా నదిపై ఇప్పటికే ఈ మార్గంలో ఒక వంతెన ఉంది. రెండు రాష్ట్రాల మధ్య 167 జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీద గానే ఇప్పటివరకు రాకపోకలు జరుగుతున్నాయి. నిజాం కాలంలో ఈ వంతెనను నిర్మించడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ పాత వంతెన మీదుగానే ఇప్పటివరకు ఆ ప్రాంతాలలో ప్రజా రవాణా, వ్యాపార మరియు వాణిజ్య పనులు జరుగుతున్నాయి. ఈ పాత వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఐదేళ్ల క్రితం దీనికి మరమ్మతులు కూడా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ పాత వంతెనకు మరమ్మత్తులు నిర్వహించింది.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కృష్ణా నది మీద ఈ పాత వంతెనకు ప్రత్యామ్నాయంగా మరొక కొత్త వంతెనను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ కొత్త వంతెన నిర్మాణం జరుగుతుంది. 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను రూ.150 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందటే ఈ కొత్త వంతెన పనులను మొదలుపెట్టారు. అయితే నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మరో ఏడాదిలో ఈ కొత్త వంతెన నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
Join WhatsApp Group Join Now