Subsidy Money: ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త తెలిపింది. దీనికోసం రైతులకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉంది. ఉచితంగా రూ. లక్ష రూపాయల వరకు ప్రయోజనం పొందే లాగా ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పించింది. దీనికోసం రైతులు వెంటనే అప్లై చేసుకోవాలి. అన్నదాతలకు ప్రభుత్వం భారీ ఊరట కలిగించింది. ప్రభుత్వం ఒక అదిరిపోయే బెనిఫిట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతుల కోసం ప్రభుత్వం సబ్సిడీతో వ్యవసాయానికి అనువైన యంత్రాలను అందిస్తుంది.
రైతులు ఎంచుకునే యంత్రం ఆధారంగా వాళ్లకు వచ్చే సబ్సిడీ కూడా ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రభుత్వం పశ్చిమగోదావరి జిల్లాలో సబ్సిడీ కోసం దాదాపు రూ. 3.9 కోట్లకు పైగా మంజూరు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో అన్నదాతలు సబ్సిడీ యంత్రాల కోసం అప్లై చేసుకోవచ్చు. వివిధ మండలాలకు చెందిన రైతులు వెంటనే దీనికోసం త్వరగా అప్లై చేసుకోండి. ఈ క్రమంలో ప్రభుత్వం అన్నదాతలకు పవర్ బ్యాటరీ స్ప్రేయర్లు, ట్రాక్టర్ అనుసంధాన నాగళ్ళు, రోటవేటర్లు అలాగే టిల్లర్ వంటివి సబ్సిడీ కింద అందిస్తుంది. అలాగే అన్నదాతలకు కొమ్మలు కట్ చేసే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు వంటివి కూడా సబ్సిడీ కింద అందిస్తుంది.
అయితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు మాత్రమే సమయం ఉందని తెలిపారు. కాబట్టి అన్నదాతలు ఈ మిగిలిన 9 రోజుల లోపే అప్లై చేసుకోవాలి. లేదంటే వాళ్లు ఈ మంచి అవకాశాన్ని మిస్ అవుతారు. అయితే రైతులు రోటవేటర్ తీసుకుంటే వాళ్లకు రూ 46 వేల వరకు సబ్సిడీ ఉంటుంది. నాగలి అయితే రు.27,800 వరకు రాయితీ ఉంటుంది. పవర్ స్ప్రేయర్ అయితే రూ.8 వేలు రాయితీ అలాగే బ్యాటరీస్ ప్రేయర్ అయితే రూ.1000 సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తుంది. కలుపు తీసే యంత్రం అయితే రూ. 35 వేల సబ్సిడీ ఉంటుంది. కొమ్మలు కట్ చేసే యంత్రం అయితే రూ. 36వేల రాయితీ ఉంటుంది. అలాగే టిల్లర్ అయితే ఏకంగా లక్ష రూపాయల వరకు రాయితీ పొందవచ్చు.