Rain: మెట్ పల్లి, మార్చి24 (ప్రజా శంఖారావం): వడగళ్ల వాన, అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పంట నష్టం వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. మెట్ పల్లి మండలంలోని అల్లూరి సీతారామరాజు తండా, రంగారావుపేట, మెట్ల చిట్టాపూర్ గ్రామాల్లో సోమవారం వడగళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా వడగళ్ల వాన కురవడంతో రైతులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. అల్లూరి సీతారామరాజు తండాలో ఆరబోసిన వరి ధాన్యం తడవడంతో రైతులు కుప్పల పై నుంచి వర్షపు నీటిని తొలగించారు. పలు చోట్ల పంట పొలాల్లో ధాన్యం గింజలు నేలరాలాయి. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం వల్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి
Join WhatsApp Group
Join Now