FORMERS GOOD NEWS: త్వరలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన 20వ విడత విడుదల కానున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక మంచి శుభవార్త తెలిపింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి యోజన 20వ విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాలలో విడుదల కానున్నాయి. ఈసారి కొత్త రూల్స్ ప్రకారం మీకు వస్తుందో లేదో తెలుసుకోండి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే అతి పెద్ద పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నీది పథకం అని చెప్పొచ్చు.
రైతులకు లాభం కలిగించే పథకం ఈ స్థాయిలో మరొకటి లేదు అని చెప్పడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకానికి చాలా ఆదరణ ఉంది. అయితే కేంద్ర పథకాలను కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదు. కానీ రైతులకు లాభం చేకూర్చే కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. అయితే ఈ పథకం కింద డబ్బులను రైతుల ఖాతాలలోకి నేరుగా ప్రధాని మోదీనే విడుదల చేస్తారు. ప్రతి రైతుకి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలలో నాలుగు నెలలకు ఒకసారి నేరుగా రైతుల ఖాతాలలోకి ప్రధాని డబ్బులను పంపిస్తారు.
ఈ పథకం 19వ విడతకు సంబంధించి బీహార్ నుంచి దేశవ్యాప్తంగా గత ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం జూన్ నెల నాలుగవ విడతకి సమయం దగ్గర అయింది. గత ఏడాది కూడా రైతుల ఖాతాలలో జూన్ నెలలో డబ్బులను పంపించారు. ఈసారి కూడా జూన్ నెలలో రైతుల ఖాతాలలో డబ్బు అందుతుందని అందరూ భావిస్తున్నారు. అయితే గతంలో కొంతమంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ డబ్బులు అకౌంట్ లో పడలేదు. ఇటువంటి వారు వెంటనే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.